అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు నిజానికి టాలీవుడ్ లో పెద్దంత క్రేజ్ లేదు. సూర్య, కార్తీకి మొదటి నుండి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయం సాధించింది. అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే కనక వర్షం కురవడం ఖాయం. అందుకే తెలుగు నిర్మాతలు ధనుష్ తో…
(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు) నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక…
(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు) ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే…
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తయిందని రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ కథనం సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది, లవ్ యూ లింగుస్వామి…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను…
గత కొన్ని రోజులుగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నూరు శాతం వాస్తవం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ప్రకటించారు.”1964లో డా. రామానాయుడుచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్…