చిత్రసీమలో ‘అందరివాడు’ సి.కళ్యాణ్
తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.
నెల్లూరు జిల్లాలో సి.కళ్యాణ్ జన్మించారు. చిత్రసీమపై మనసు పారేసుకొని, మదరాసు చేరారు. అక్కడ దొరికిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుంటూ ముందుకు సాగారు. కొన్ని చిన్న చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ‘శ్రీఅమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై సి.కళ్యాణ్ సమర్ఫణలో “వద్దు బావా తప్పు, లేడీస్ డాక్టర్” వంటి చిత్రాలు రూపొందాయి. తాను చిన్న నిర్మాత అయినా, ఇతర నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేసి ఆదుకొనేవారు. అందువల్లే సి.కళ్యాణ్ అందరివాడు అనిపించుకున్నారు.
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
శ్రీహరి హీరోగా సి.కళ్యాణ్ నిర్మించిన ‘బలరామ్’ మంచి విజయం సాధించింది. ఆయన సోదరుడు సి.వెంకటేశ్వరరావు నిర్మాతగా, సి. కళ్యాణ్ సమర్పకుడిగా చిత్రాలు నిర్మించేవారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘చందమామ’ మంచి విజయం సాధించి, కళ్యాణ్ కు తొలి విజయాన్ని అందించింది. ఆ తరువాత తమ సొంత బ్యానర్ సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపైనా, ఇతర నిర్మాతలతోనూ కలసి చిత్రనిర్మాణం సాగించారు. మహేశ్ బాబుతో ‘ఖలేజా’, నితిన్ తో ‘ఆటాడిస్తా’, నానితో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, వరుణ్ తేజ్ తో ‘లోఫర్’, సాయిధరమ్ తో ‘ఇంటెలిజెంట్’, ఛార్మితో ‘జ్యోతిలక్ష్మి’ , రాజశేఖర్ తో ‘కల్కి’ వంటి చిత్రాలతో పాటు కొన్ని అనువాద చిత్రాలనూ అందించారు సి.కళ్యాణ్. బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘పరమవీరచక్ర’ నిర్మించారు. తరువాత బాలకృష్ణతో ‘జైసింహా, రూలర్’ వంటి చిత్రాలనూ తెరకెక్కించారు. అప్పట్లో విజయం సాధించిన ‘జై సింహా’ శతదినోత్సవాన్ని చిలకలూరి పేటలో ఘనంగానూ నిర్వహించారు.
సి.కళ్యాణ్ నిర్మాతల మండలి అధ్యక్షునిగా ఉన్నారు. ఛాంబర్ లోనూ అనేక శాఖల్లో కీలక పాత్రలు పోషించారు. సౌత్ ఇండియా ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షునిగా పనిచేశారు. సి.కళ్యాణ్ పనితనం గమనించిన దక్షిణాది అన్ని చిత్రసీమల వారు ఆయనను ఆల్ ఇండియా ఫిలిమ్ కాన్ఫెడరేషన్ అధ్యక్షునిగానూ ఎన్నుకున్నారు. ఇలా అందరితోనూ సఖ్యంగా సాగుతున్న సి. కళ్యాణ్ ఇప్పటికీ చిత్ర నిర్మాణంలో బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా ‘గాడ్సే’ అనే సినిమాను నిర్మిస్తున్నారాయన.
రానా హీరోగా ‘1945’ అనే సినిమాను నిర్మించారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ చిత్రం నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు కళ్యాణ్. ఏది ఏమైనా సి.కళ్యాణ్ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. మునుముందు ఆయన మరిన్ని మంచి చిత్రాలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!