హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్,…
తెలంగాణ పోలీసులు మరొకసారి తమ ధైర్య సహసాలను చూపెట్టారు.. వారం రోజులు పాటు డ్రగ్ మాఫియా అడ్డాలో పాగా వేశారు.. డ్రగ్ మాఫియాకు తెలియకుండానే వాళ్ళ గ్యాంగ్ లో చేరిపోయారు.. డ్రగ్ మాఫియా గ్యాంగ్ లోకి చేరిపోయి కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు.. తెలంగాణ పోలీసులు చేసిన కోవర్ట్ ఆపరేషన్ కి గోవా మొత్తం దద్దరిల్లిపోయింది ..గోవాలో ఏకంగా ఆరు డ్రగ్ మాఫియా గ్యాంగులను పట్టుకున్నారు.. గోవా కేంద్రంగా హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించి…
మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్లో గ్రాండ్గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్మార్క్ స్టైల్తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్…
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన కెజీయఫ్, సలార్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ ప్రశాంత్ నీల్కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా తన అభిమాన హీరోతో చేయాలని ఉంది. అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రశాంత్ నీల్ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆయనతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు నీల్. Also Read: OG…
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్లో…
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు…
మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానని అన్నారు. కానీ, ఆ విషయంలో తన స్నేహితుడు నారా రోహిత్ను చూసి తాను ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. Also…
VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు…
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.