PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా స్పష్టం చేసింది. ఒక మీడియా సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. SCO సభ్యదేశాలన్నింటికీ నిబంధనల ప్రకారం ఆహ్వానాలు పంపుతామని వెల్లడించారు. ఈ సంస్థ ప్రోటోకాల్ ప్రక్రియ ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే దేశం సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వ నాయకులను ఆహ్వానించడం ఒక బాధ్యత అని, కాబట్టి భారత్ కూడా ఈ జాబితాలో ఖచ్చితంగా ఉంటుందని ఆయన వివరించారు. ఇదే సమయంలో, మనీలాలో జరిగే ఆసియాన్ (ASEAN) సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మధ్య ఏవైనా ద్వైపాక్షిక భేటీలు జరుగుతాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత్ నుంచి అటువంటి సమావేశం కోసం ఎలాంటి అభ్యర్థన రాలేదని పాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
యూరేషియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక పురోగతిని పెంపొందించే లక్ష్యంతో 2001 జూన్ 15న బీజింగ్లో ఈ షాంఘై సహకార సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే 10 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సంస్థలో అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన ‘కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్’ (CHS) అధ్యక్ష బాధ్యతలు ప్రతి సంవత్సరం ఆంగ్ల అక్షర క్రమం (Alphabetical Order) ప్రకారం సభ్యదేశాల మధ్య మారుతుంటాయి. ఆ క్రమంలోనే 2027లో ఇస్లామాబాద్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించే అవకాశం పాకిస్థాన్కు దక్కింది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?