నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం, అందులో పిల్లలకు పరీక్షల సమయం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని ఖాళీగానే కనపడుతున్నాయి. దీనితో శ్రీవారి దర్శనం భక్తులకు అత్యంత సులువుగానే అవుతుంది. ఇక అలాగే టీటీడీ వసతి గృహాల విషయంలోనూ భక్తులకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. అలాగే తిరుమలలోను ఏ వీధిలో కూడా పెద్దగా రద్దీ కానపడం లేదు. Also read: Navjot Singh Sidhu:…
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు.
తిరుమలలో రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమల నడక మార్గంలో గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేయడం కలకలం రేగింది.. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే కాగా.. టీటీడీ చరిత్రలోనే ఇది తొలి ఘటనగా నిలిచిపోయింది.. అయితే, ఆ లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించారు అటవీశాఖ అధికారులు