Raghu Rama Krishna Raju: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది.. ఫలితాలు రావాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.. కానీ, ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సారి 151కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం.. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందనే ప్రకటించిన విషయం విదితమే కాగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 125 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి 125 నుంచి 150 సీట్లలో విజయం సాధిస్తుంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.. అంతేకాదు.. నా మాట నిజమవుతుందో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిజమవుతుందో.. జూన్ 4వ తేదీన మధ్యాహ్నం వరకు ప్రజలకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు నరసాపురం ఎంపీ మరియు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి.. నరసాపురం లోక్సభ ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణ రాజు.. ఆ తర్వాత క్రమంగా ఆ పార్టీకి దూరమైన విషయం విదితమే.
Read Also: Sunrisers Hyderabad: నాలుగేళ్ల తర్వాత ప్లేఆఫ్స్కు సన్రైజర్స్ హైదరాబాద్.. ఇక కప్పు మనదే!