కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను…
అన్నమయ్యని అగౌరపరుస్తున్నారని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డి. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ,కళ్యాణోత్సవం,ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలుతో పాటు స్థానికుల నివాసాలను తొలగించాం….వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలలో పునరావాసం కల్పించాం అన్నారు ధర్మారెడ్డి. అన్నమయ్య వంశీకులుకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తూన్న గౌరవ మర్యాదలు కల్పిస్తున్నాం అన్నారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజేక్ట్…
తాజాగా టాలీవుడ్ ప్రముఖులంతా తిరుమలలో సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో…
తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను ఈనెల 22 వరకు బుక్ చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపింది. ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తామని టీటీడీ వివరించింది. ఈనెల 22న టిక్కెట్లు పొందిన వారికి వివరాలు పంపిస్తామంది. ఈనెల 20న ఆర్జిత…
కలియుగ వైకుంఠం తిరుమల రథ సప్తమి వేడుకలకు సిద్ధమయింది. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.రథ సప్తమి నాడు ఏటా భక్తులతో తిరుమల సందడిగా వుంటుంది. అయితే తాజా పరిస్థితుల్లో భక్తులకు తిరుమల వెళ్ళి స్వయంగా వేడుకలను చూసే అవకాశం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సప్త వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.
తిరులమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో ఇక నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండవని పేర్కొంది. పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులును దర్శనానికి అనుమతించిన టీటీడీ. పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3 లక్షల 77వేల 943 మంది భక్తులు. 1,22,799 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పది…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.. అంటే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. కాగా, శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు.. ఇక, 1949లో వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోవైపు వైకుంఠ ద్వార…
నూతన సంవత్సరం 2022 సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయాలకు చెందిన వేదపండితులు ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని మోడీని కలిసి ఆయనకు శుభాశీస్సులు అందచేశారు. దేవస్థానాల నుంచి తీసుకెళ్ళిన ప్రసాదాలను ప్రధానికి అందచేశారు. అక్షింతలు వేదపండితులు ఆశీర్వచనాలు, దేవస్థానం తరఫున చిత్రపటాలు అందచేశారు. ప్రధాని మోడీ చేతికి కంకణాలు కట్టి, నుదుటిన తిలకం దిద్దారు వేదపండితులు.
తిరుమల శ్రీవారి టికెట్లు ఏవైనా క్షణాల్లో అమ్ముడవుతుంటాయి. తాజాగా టీటీడీ సర్వదర్శనం టోకెన్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. జనవరి నెలకు ఆన్ లైన్ లో రెండు లక్షల 60 వేల టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. టోకెన్లు విడుదల చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు భక్తులు. టోకెన్ల బుకింగ్ పూర్తయిన విషయం తెలియక టీటీడీ వెబ్ సైట్ లో లాగిన్ అవుతున్నారు వేలాది మంది భక్తులు. వారికి నిరాశే కలుగుతోంది. రేపు శ్రీవాణి…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతంలో దర్శనాలు పరిమితం చేశారు. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తిరుమలకు వెళ్ళే దారుల్లో కొండచరియలు విరిగిపడడం, నడక దారి పాడవడంతో భక్తులు తగ్గారు. తిరుమలలో ఆదివారం భక్తులు బాగా పెరిగారు. ఆదివారం కావడం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారింది. శ్రీవారిని 36162 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.…