Tirumala: భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు.
46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతిస్తాం అన్నారు. గత ఏడాది వర్షాల కారణంగా శ్రీవారిమెట్టు మార్గం ధ్వంసం అయింది. ఈ మార్గంలో మరమ్మతుపనులు చేపడుతోంది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఇవాళ నుంచి పునరుద్ధరిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. మరోవైపు స్లాట్ దర్శనాలు తిరిగి ప్రారంభించే యోచనలో టీటీడీ వున్నట్టు తెలుస్తోంది.
Also Read
Also Read: Strike: పెట్రో ధరలపై ఆగ్రహం.. రెండు రోజులు ఆటోలు, టాక్సీలు బంద్..
గత కొంతకాలంగా స్లాట్ దర్శనాలు లేవు. దీంతో భక్తులు వీటి కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 20 వేల మంది వరకు సర్వదర్శన టోకెన్లు జారీచేయాలని నిర్ణయం తీసుకోనుంది. దర్శన టోకెన్లు లేని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించాలని భావిస్తోంది టీటీడీ. ఈ నిర్ణయం కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండే భక్తులకు దర్శన సమయం పెరగనుంది.
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!