గత యేడాది కరోనా కారణంగా థియేటర్లు మూతపడినప్పుడు ఏ హీరో సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సత్యదేవ్. అతను నటించిన ’47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అంతేకాదు… ఈ యేడాది ‘పిట్ట కథలు’ ఆంధాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. విశేషం ఏమంటే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకోగానే విడుదలైన సినిమా కూడా సత్యదేవ్ దే కావడం! లాయర్ రామచంద్రగా సత్యదేవ్…
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర…
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఆమెకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని ఛాన్స్ లైతే దక్కాయి. అలా ప్రియాంక అంగీకరించిన రెండు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక…
ఎట్టకేలకు రాష్ట్రంలో థియేటర్ల రీఓపెన్ పై నెలకొన్న సస్పెన్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్లు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత 100% సీటింగ్ సామర్థ్యంతో తెలంగాణలో థియేటర్లు తిరిగి ఓపెన్ చేయడానికి అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గతకొంతకాలంగా థియేటర్లను తిరిగి తెరవడంపై సస్పెన్స్ నడుస్తోంది. Read Also : బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ…
మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు…
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా……
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్…
టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. Read…
కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం “తిమ్మరుసు”. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మజీ, రవి బాబు, అంకిత్, అజయ్ తదితరులు నటించారు. సంగీతం శ్రీచరన్ పాకాల అందించారు. శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వం వహించారు. “తిమ్మరుసు”ను ఈస్ట్ కోస్ట్…