‘రాధేశ్యామ్’ తేదీకి వస్తున్న ఆ ఐదు చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా… ఈ శుక్రవారం (30వ తేదీ) ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
పది రోజుల క్రితం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి, తమ సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు ఎగ్జిబిటర్స్, థియేటర్ల యాజమాన్యం. దాంతో సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెంటనే థియేటర్లు తెరుస్తామని యాజమాన్యం తలసానికి మాట ఇచ్చింది. కానీ తగినన్ని సినిమాలు విడుదలకు లేకపోవడంతో థియేటర్లను తెరవలేదు. కానీ ఈ శుక్రవారం సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జా ‘ఇష్క్’, నందగోపాల్ నటించిన ‘నరసింహాపురం’తో పాటు ‘త్రయం’, ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి. దీంతో తెలంగాణలో థియేటర్లు ఒక మోస్తరుగా అయినా కళకళలాడటం జరుగుతుంది.
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
Read Also : “ఆదిపురుష్” హీరోయిన్ సినిమా లీక్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. అక్కడ రోజుకు మూడు ఆటల ప్రదర్శనకే అనుమతి ఉంది. అలానే టిక్కెట్ రేట్ల పెంపు, కరెంట్ బిల్లుల విషయంలో పంచాయితీ ఇంకా తెగలేదు. జగన్ ప్రభుత్వం సైతం ఆ విషయంపై దృష్టి పెట్టకపోవడంతో కినుక వహించిన థియేటర్ల యాజమాన్యం వాటిని తెరవడానికి ఆసక్తి చూపడంలేదు. ‘తిమ్మరుసు, ఇష్క్’ చిత్రాలకు ఓ మోస్తరు క్రేజ్ ఉన్నా… అక్కడ థియేటర్లు తెరవకపోతే… నిర్మాతలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఈ మూడు రోజుల్లో ప్రభుత్వంతో ఏమైనా చర్యలు జరిపి, థియేటర్లను తెరుస్తారేమో చూడాలి. అలానే యాభై శాతం ఆక్యుపెన్సీని శుక్రవారం నుండి నూరుశాతం చేస్తేనే ఇటు ఎగ్జిబిటర్ కు, అటు నిర్మాతకు మేలు జరుగుతుంది.
ఈ అంశాలలో క్లారిటీ వస్తే… ఆగస్ట్ మొదటివారంలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఇప్పటికే ‘ఎస్. ఆర్. కళ్యాణమండపం’, ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ వంటి మూడు నాలుగు సినిమాలు ఆగస్ట్ 6న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలోని ఎగ్జిబిటర్స్ ఒక త్రాటి పైకి వచ్చి థియేటర్లు తెరిస్తే… పెద్ద నిర్మాతలు సైతం తమ చిత్రాల విడుదలకు క్యూ కడతారనడంలో సందేహం లేదు.
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!