రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. పైగా అక్కడ యాభై శాతమే ఆక్యుపెన్సీ. ఇదిలా ఉంటే… థియేటర్లు తిరిగి తెరచుకుంటున్న నేపథ్యంలో పేరుకు ఐదు చిత్రాలు విడుదల కాబోతున్నా, ప్రధాన పోటీ మాత్రం రెండు సినిమాల మధ్యనే ఉంటుంది. అది సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజ సజ్జా ‘ఇష్క్’.
Read Also : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో “మల్లేశం” డైరెక్టర్ మూవీ
Also Read
- Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
- Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
- Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
- Vijay-Trisha: "గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం".. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
‘జ్యోతిలక్ష్మీ’ మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కు రీమేక్ సినిమాలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. కరోనా కారణంగా థియేటర్లు మూత పడినప్పుడు అతను నటించిన ’47 డేస్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే అంతకు ముందు వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ తో పాటు ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ సత్యదేవ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఒకటి తమిళ రీమేక్ కాగా, మరొకటి మలయాళ రీమేక్. కానీ చిత్రంగా ఇప్పుడు సత్యదేవ్ కన్నడ రీమేక్స్ పై దృష్టి పెట్టాడు. శుక్రవారం జనం ముందుకు వస్తున్న ‘తిమ్మరుసు’, 2019 జనవరిలో వచ్చిన కన్నడ సినిమా ‘బీర్బల్’కు రీమేక్. దీన్ని కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’గా రీమేక్ చేసిన శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు. విశేషం ఏమంటే… 2020లో వచ్చిన మరో కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’లోనూ సత్యదేవ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.
ఇక 30న విడుదల కాబోతున్న మరో రీమేక్ మూవీ ‘ఇష్క్’. 2019లో మలయాళంలో వచ్చిన ‘ఇష్క్’ మూవీని అదే పేరుతో తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ రీమేక్ చేసింది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా… లీడ్ రోల్ చేసిన ‘ఓ బేబీ’ సైతం కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కావడం విశేషం. ఇదిలా ఉంటే… ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’ సక్సెస్ తో తేజ సజ్జా మంచి ఊపు మీదున్నాడు. మరి కోర్టు డ్రామా ‘తిమ్మరుసు’, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఇష్క్’లలో తెలుగు ప్రేక్షకులు దేనివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
తాజావార్తలు
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..