టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈ క్రమంలో శ్యామ్ సుందర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కాగా శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నిఖిల్.. సక్సెస్ ఫుల్ హీరోగా…
నిర్మాత నట్టి కుమార్ తో తనకున్న విభేదాలపై రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు స్పందించాడు. అయితే… తనవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ వర్మ విమర్శించడాన్ని నట్టి కుమార్ ఖండించాడు. వర్మ బాధితులు చిత్రసీమలో ఎంతో మంది ఉన్నారని చెప్పాడు. అయితే నట్టి కుమార్ చేసిన తాజా విమర్శలపై గురువారం ఆర్జీవీ మరోసారి స్పందించాడు. తన జవాబును ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు విడుదల చేశాడు. అందులో నట్టి కుమార్ ను సూటిగా ప్రశ్నిస్తూ… శరాలను సంధించాడు…
ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్బ్రాండ్కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్ చూపిస్తారా? నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా? చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా…
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి…
కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్ ను విధించి థర్డ్వేవ్కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్…
తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్…
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ…
బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు ఎంతోమంది స్టార్లు నటిస్తున్నారు. పాన ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9…
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…