Ganja Gang: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గాంజా గ్యాంగ్.. కత్తులతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ హసన్ నగర్ లో శివారులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. తాజాగా హసన్ నగర్ లో.. గాంజా గ్యాంగ్ హల్ చల్ సృష్టించింది. హలీమ్ అనే యువకుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసారు. సుమారు ఆరు మంది హలీమ్పై దాడి చేసినట్లు సమాచారం. గంజాయి మత్తులో యువకుడిపై దాడి చేసి చెరువులో పడేసి వెళ్లిపోయారు. యువకుడి అరుపులు కేకలు విని చెరువులో నుండి బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శరీరంలోని పలు చోట్ల కత్తి పోట్లు వుండటంతో వైద్యం చేసేందుకు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అకారణంగా తన పై దాడి చేసారని, ప్రతి రోజు రాత్రి 10 గంటలు దాటింది అంటే చాలు కొంత మంది యువకులు గాంజా సేవించి మద్యం మత్తులో వచ్చిపోయేవారిని కత్తులతో దాడి చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని హసన్ నగర్ ప్రజలు. ఎన్ని సార్లు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. నన్ను చంపడానికి ఉస్మానియా ఆసుపత్రికి కూడా వచ్చారని బాధితుడు హలీమ్ తెలిపారు. 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
read also: Monkeypox: 95 శాతం కేసులు ఆ రెండు ప్రాంతాల్లోనే.. 78 దేశాల్లో కేసులు
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
2022 జనవరి 21న హైదారాబాద్ నగరంలో గంజాయి స్మగ్లర్స్ ముఠా పట్టుపడిన విషయం తెలిసిందే. సైదాబాద్ సంఘటన తర్వాత గంజాయి రవాణపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు చెంది మరో ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1.80 కోట్ల విలువ చేసే 800 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి.. ఒడిశాలోని కొరపుట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు అల్లం రవాణా మాటున నిందితులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర మీడియా ద్వారా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా నగరంలో గంజా గ్యాంగ్ ముఠా ఆగడాలను అరికట్ట వేయలేకపోతున్నారు. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Chikoti Praveen: హవాలా పై ఈడీ ఫోకస్ .. చికోటి ప్రవీణ్కు చిక్కులు తప్పవా..?
తాజావార్తలు
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!