రానున్న శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల దృష్ట్యా ఏర్పాట్లపై ఈ రోజు హైదరాబాద్ సాలర్ జంగ్ మ్యూజియం లో బోనాల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ బోనాల సమీక్ష సమావేశంలో భాగ్యనగర శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఉరిగింపు కమిటీ సభ్యులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారని, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ భట్నాగర్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో స్పెషల్ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి.
అస్సాంలో వరదల పరిస్థితి కాస్త మెరుగుపడింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం వివిధ ప్రాంతాలలో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నదులు ఎక్కడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదు.