Pawan Kalyan: తెలంగాణ తరహాలో ఉండాలనేది నా కోరిక.. భీమవరంలో పవన్ కల్యాణ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం అందాలనేది తన బలమైన కోరిక అని తెలిపారు. కులాల్లో ఒకళ్ళు ఎదుగుతున్నారని.. మరొకరు ఎదగలేదు అనే విషయం పై లోతైన అధ్యయనం జరగాలని నాయకులకు పవన్ కల్యాణ్ సూచించారు.
Read Also: జూలై లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు .. ఫీచర్స్, ధరలు..
Also Read
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ఉపకులాల మధ్య ఐక్యత లేకపోవడం సమస్యగా మారిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మరోవైపు బీసీల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుందని తెలిపారు. బీసీ కులాలు కచ్చితంగా అధికారంలోకి రావాలని.. బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పంచాయితీ స్థాయి పదవుల్లో బీసీలు ఎంత బలపడితే అంత పైకి వెళ్ళగలరని తెలిపారు. ఈత వనాలను పెంచి కల్లుగీత కార్మికులకు అండగా ఉండాలని జనసేనాని పిలుపునిచ్చారు. అన్నాహజారే స్ఫూర్తితో గ్రామాల్లో 70శాతం కోరుకుంటే అక్కడ మద్యం అమ్మకాలు నిషేధించాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
Read Also: Opposition Meeting: విపక్షాల రెండో భేటీ వేదిక మార్పు.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఛేంజ్
మరోవైపు సంపూర్ణ మద్యపానం నిషేధం దేశంలో పూర్తిస్థాయిలో అమలైన దాఖలాలు ఎక్కడ లేవని పవన్ కల్యాణ్ అన్నారు. దామాషా పద్ధతిలో బీసీ యువతకు 10 లక్షలు పెట్టుబడి సాయం అందించే విధంగా జనసేన ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. గౌడ కులస్తుల్ని ముఖ్యమంత్రిగా చూసే రోజు రావాలని.. అన్ని కులాలని కలుపుకుని వెళ్తేనే అది సాధ్యమవుతుందని పవన్ అన్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు.. మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదు అనేది అధ్యయనం జరగాలని పవన్ కల్యాణ్ అన్నారు.
- Tags
- gouds
- janasena
- Meeting
- Pawan
- telugu news
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!