Pawan Kalyan: తెలంగాణ తరహాలో ఉండాలనేది నా కోరిక.. భీమవరంలో పవన్ కల్యాణ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం అందాలనేది తన బలమైన కోరిక అని తెలిపారు. కులాల్లో ఒకళ్ళు ఎదుగుతున్నారని.. మరొకరు ఎదగలేదు అనే విషయం పై లోతైన అధ్యయనం జరగాలని నాయకులకు పవన్ కల్యాణ్ సూచించారు.
Read Also: జూలై లో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు .. ఫీచర్స్, ధరలు..
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ఉపకులాల మధ్య ఐక్యత లేకపోవడం సమస్యగా మారిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మరోవైపు బీసీల సంక్షేమానికి జనసేన కట్టుబడి ఉంటుందని తెలిపారు. బీసీ కులాలు కచ్చితంగా అధికారంలోకి రావాలని.. బీసీల్లో నలుగురికి పదవులు ఇచ్చి వేల మందికి అన్యాయం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. పంచాయితీ స్థాయి పదవుల్లో బీసీలు ఎంత బలపడితే అంత పైకి వెళ్ళగలరని తెలిపారు. ఈత వనాలను పెంచి కల్లుగీత కార్మికులకు అండగా ఉండాలని జనసేనాని పిలుపునిచ్చారు. అన్నాహజారే స్ఫూర్తితో గ్రామాల్లో 70శాతం కోరుకుంటే అక్కడ మద్యం అమ్మకాలు నిషేధించాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
Read Also: Opposition Meeting: విపక్షాల రెండో భేటీ వేదిక మార్పు.. వాతావరణ పరిస్థితుల కారణంగా ఛేంజ్
మరోవైపు సంపూర్ణ మద్యపానం నిషేధం దేశంలో పూర్తిస్థాయిలో అమలైన దాఖలాలు ఎక్కడ లేవని పవన్ కల్యాణ్ అన్నారు. దామాషా పద్ధతిలో బీసీ యువతకు 10 లక్షలు పెట్టుబడి సాయం అందించే విధంగా జనసేన ఆలోచన చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. గౌడ కులస్తుల్ని ముఖ్యమంత్రిగా చూసే రోజు రావాలని.. అన్ని కులాలని కలుపుకుని వెళ్తేనే అది సాధ్యమవుతుందని పవన్ అన్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అందరూ ఆదరిస్తున్నపుడు.. మిగతా వారిని ఎందుకు ఆదరించడం లేదు అనేది అధ్యయనం జరగాలని పవన్ కల్యాణ్ అన్నారు.
- Tags
- gouds
- janasena
- Meeting
- Pawan
- telugu news
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!