CP Trivikram Varma: రియల్టర్ కిడ్నాప్ కేసు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కాదు.. కమీషన్ ఏజెంట్లు..!
CP Trivikram Varma: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. పట్నాల శ్రీనివాస్ ఆయన భార్య లక్ష్మీని.. బ్రహ్మయ్య, సాయి నిఖిల్, మణికంఠ, ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తులు కారులో అపహరించారని.. మరోవైపు వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు కాదని కమీషన్ ఏజెంట్లని సీపీ తెలిపారు.
Read Also: NASA: చంద్రుడిపై మైనింగ్ చేయాలని నాసా ప్లాన్..
Also Read
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
కిడ్నాప్కు గురైన శ్రీనివాస్ 2021లో రావుల పాలెంలో సత్య సౌధ సంస్ లో వాలంటీర్గా పని చేశాడని సీపీ తివిక్రమ్ వర్మ చెప్పారు. రెండు నెలలు క్రితం అక్కయ్యపాలెంలో ఇల్లు తీసుకుని చరణ్ గ్రూప్లో కమిషన్ ఏజెంట్గా పని చేస్తున్నాడని కమీషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీనివాస్పై కంచికచర్ల, నర్సీపట్నం, రాజమండ్రి, విజయవాడలలో చీటింగ్ కేసులున్నాయని సీపీ తెలిపారు. అయితే వీరి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీల వల్లే శ్రీనివాస్ ను, అతని భార్య లక్ష్మీని కిడ్నాప్ చేసినట్లు సీపీ తెలిపారు. యలమంచిలి దగ్గర శ్రీనివాస్ భార్య లక్ష్మీని విడిచిపెట్టారని.. ఆమె ఇచ్చిన సమాచారంతో కత్తిపూడి పోలీసులు నిందితులను పట్టుకున్నారని సీపీ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: తెలంగాణ తరహాలో ఉండాలనేది నా కోరిక.. భీమవరంలో పవన్ కల్యాణ్..!
మరోవైపు విశాఖ నగరంలో ఉన్న గన్ లైసెన్సులపై సీపీ త్రివిక్రమ్ వర్మ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో మొత్తం 620 గన్ లైసెన్స్ ఉన్నాయని చెప్పారు. 2020 నుంచి ఇప్పటి వరకు 15 మంది మాత్రమే గన్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారని తెలిపారు. 2020లోనే కలెక్టర్ ఆఫీస్ ద్వారా మంత్రి గుడివాడ అమర్నాథ్ దరఖాస్తు చేసుకున్నారని సీపీ పేర్కొన్నారు. ఇటీవలే కిడ్నాప్కు గురైన ఎంపీ కుటుంబ సభ్యులు కూడా గన్ లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఇక గాజువాక విద్యార్థుల మిస్సింగ్ కేసుపైనా కమీషనర్ స్పందించారు. గాజువాకలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్ అయినట్లు కేసు నమోదు అయిందన్నారు. తొలుత వారు అనకాపల్లి వెళ్లినట్లు గుర్తించామని.. తర్వాత వెరీజ్ మై ట్రాయిన్ యాప్ ద్వారా సమాచారం తెలుసుకొని హైదరాబాద్ వెళ్లారని, వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించామని త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
-
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
-
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?