Vladimir Putin: ప్రధాని మోడీని అభినందించిన పుతిన్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు. మాస్కోలో రష్యా ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ (ASI) నిర్వహించిన ఫోరమ్లో పుతిన్ ఈ విధంగా అన్నారు. స్థానికంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి, సమీకరించడానికి కంపెనీలను ప్రోత్సహిస్తున్న దేశానికి భారతదేశాన్ని ఉదాహరణగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
Also Read: WHO: కూల్డ్రింక్స్ తాగాలంటే భయపడాల్సిందేనా..? వాటిలో క్యాన్సర్ కారకం
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
మా పెద్ద స్నేహితుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సంవత్సరాల క్రితం‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని పుతిన్ అన్నారు. బాగా పని చేసేదాన్ని అనుకరించడం వల్ల ఎటువంటి హాని జరగదన్నారు. రష్యాలో దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించడానికి భారతదేశాన్ని ఉదాహరణగా పుతిన్ పేర్కొన్నారు. కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా మార్కెట్ చేయడంలో సహాయపడటానికి మాస్కోకు మద్దతు సాధనాలను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిక తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సమర్థవంతమైన నమూనాను రూపొందించడానికి భారతదేశం చొరవను ఆయన ప్రశంసించారు.
Also Read: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేయొచ్చు
తయారీపై భారతదేశంపునరుద్ధరణ దృష్టిలో భాగంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం సెప్టెంబర్ 2014లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. భారతదేశాన్ని అత్యంత ప్రాధాన్య ప్రపంచ తయారీ గమ్యస్థానంగా ప్రోత్సహించడం ఈ చొరవ యొక్క లక్ష్యం. దేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశాన్ని అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్లోబలైజ్డ్ వర్క్స్పేస్లో భారతీయ కంపెనీలను రాణించేలా చేయడంలో సహాయపడుతోంది. దీన్ని సాధించడానికి, వ్యాపారాన్ని నిర్వహించడాన్ని సమూలంగా మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది.
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!