మహిళల భద్రత విషయంలో తన సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొన్ని గంటల తర్వాత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాజేంద్ర గూడాను రాష్ట్ర మంత్రిగా తొలగించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరిగే చివరి సెషన్లో రాజస్థాన్ అసెంబ్లీ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల పని హామీనిచ్చే మైలురాయి బిల్లును ఆమోదించింది. వృద్ధులు, ప్రత్యేక వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు కనీసం రూ.1,000 పెన్షన్కు కూడా ఈ బిల్లు హామీ ఇస్తుంది.
ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వరుణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జూలై 28న విచారణ జరుపుతామని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్గా మారింది.
ఇటాలియన్ అధికారులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు. వారు సిసిలీ దక్షిణ తీరంలో రికార్డు స్థాయిలో 5.3-టన్నుల కొకైన్ సరుకును అడ్డుకున్నారు.
ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్ల వ్యవస్థ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పవన్ వాలంటీర్స్ ని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో వాలంటీర్స్ గా అత్యధికంగా మహిళలే పనిచేస్తున్నారని, అసలు కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారం ఇస్తారన్నారు తానేటి వనిత. breaking news, latest news, telugu news,…