Russia: రష్యాలో పేలిన హాట్ వాటర్ పైప్ లైన్.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా రాజధాని మాస్కోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వ్రెమెనా గోదా మాల్ దగ్గర వేడి నీటి పైపు లైన్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫస్ట్ ఒకరు చనిపోయినట్లు మేయర్ తెలిపాడు. కానీ మరో ముగ్గురు కూడా చనిపోయారని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Read Also: Covid 19: చైనా తర్వాత ఇప్పుడు అమెరికా.. కోవిడ్ లాంటి మహమ్మారి వస్తోందని హెచ్చరిక
Also Read
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
షాపింగ్ సెంటర్లో జరిగిన విషాదం మరో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాలకు, స్నేహితులకు మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రగాఢ సానుభూతిని టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయని, వారిలో తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చామని, ఒకరిని ఔట్ పేషెంట్ చికిత్స కోసం పంపించామని హెల్త్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్
మాస్కో మాల్ లో పైపు పగిలిన ఘటనపై రష్యా దర్యాప్తు కమిటీ క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఇన్వెస్టిగేటివ్ కమిటీ మాస్కో విభాగం ప్రతినిధి యూలియా ఇవానోవా తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ క్రిమినల్ కోడ్ లోని ఆర్టికల్ 238లోని పార్ట్ 3 కింద నేరం ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. 2007లో ప్రారంభమైన వ్రెమెనా గోదా మాల్ లో 150కి పైగా స్టోర్లున్నాయి. అయితే, ఘటనపై గాయపడిన వారికి డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!