Godavari River : దోబూచులాదుతున్న గోదావరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద దోబూచులాడుతుంది. మూడు రోజుల నుంచి గోదావరి వరద పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. గత మూడు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వచ్చి చేరుతోంది. గోదావరి కి అయితే గత ఏడాది వచ్చినటువంటి వరద మాత్రం రావడం లేదు. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం 43 అడుగులకు చేరుకున్న గోదావరి మళ్లీ 39 అడుగులకు తగ్గింది. కానీ గత రాత్రి నుంచి మళ్లీ గోదావరి పెరగటం ప్రారంభించింది. నిన్న సాయంత్రం నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన తెల్లవారుజామున 6 గంటల వరకు గోదావరి 43. 6 అడుగుల వరకు చేరుకుంది.
Also Read : Biggest Cemetery : ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక.. ఎక్కడో తెలుసా?
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
అయితే మళ్లీ అంతలోనే గోదావరి తగ్గుదల ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి రెండు పాయింట్లు తగ్గి 43.4 అడుగులకు చేరుకుంది. ఎగువన పేరూరు వద్ద కూడా గోదావరి తగ్గటం ప్రారంభమైంది. అయితే ఎగువన భారీ వరద అయితే ఉన్నది ఆ వరద రావడానికి సమయం పడుతుంది. దిగువన పోలవరం వద్ద కూడా ఇదే దోబూచులాట కొన సాగుతుంది .పోలవరం వద్ద పెరుగుతూ తగ్గుతూ మళ్లీ పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 8 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా అదేవిధంగా పోలవరం వద్ద దిగువకి ధవలేశ్వరం వైపు ఆరున్నర లక్షలకు పైగా వెళ్తుంది అయితే దిగువన ఉన్న శబరి నది వేగంగా స్పీడ్ గా లేకపోవడంతో భద్రాచలం వద్ద వరదంతా కూడా సాఫీగా దిగువకు వెళ్ళిపోతుంది. 9,51,560 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుంది. అయితే ఇప్పటికే భద్రాచలం వద్ద గత ఏడాది వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చిన వద్ద నుంచి అధికార యంత్రం అలర్ట్ గా ఉంది.
Also Read : Trains Cancelled: ఏపీ, తెలంగాణా రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు
మొదటి ప్రమాద హెచ్చరిక రాగానే భద్రాచలంలోని కొత్త కాలనీ చెందిన 90 మందిని కొనరావస కేంద్రాలకి తరలించారు . అయితే గతంలో రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత పునరావస కేంద్రాలకు తరలించే అధికారులు ఇప్పుడు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గర నుంచి తరలించడం ప్రారంభించారు. ఇది ఎన్నికల ఏడాది కూడా కావడంతో అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం తగు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. ఇప్పటికే పర్ణశాల వద్ద నార చీరలు మునిగిపోయాయి 36 అడుగులు వస్తే నార చీరల వద్ద కాలువ ఉప్పొంగుతుంది దాని ప్రభావంతో మునిగిపోవడం అనేది సహజంగానే జరుగుతుంది అయితే ఇప్పటివరకు భద్రాచలం పరివాహక ప్రాంతంలో రాకపోకలకు ఎక్కడా కూడా అంతరాయం ఏర్పడలేదు. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే ఆ స్థాయికి వరద వస్తే భద్రాచలం వద్ద ఎక్కువ ప్రాంతంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..