ఛత్తీస్గఢ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. ఛత్తీస్గఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుపెట్టాలని జోరుగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రానికి ఆప్ వరాల జల్లు కురిపించింది.
లడఖ్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్లోని లేహ్ జిల్లాలో వారి వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది.
మణిపూర్లో జీ20 ఈవెంట్ను నిర్వహించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో శనివారం మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్పై వెళ్లారు.