మహారాష్ట్రలోని నాగ్పూర్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో తానే కొత్త దారి చూపించాడని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాగుట్ట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ ప్రీ వెడ్డింగ్ షూట్పై సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారి వివాదాన్ని సృష్టించింది. అయితే కొత్తగా పెళ్లయిన పోలీసు జంట సీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. అనంతరం నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీస్…
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు.
ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్ను నిర్వహిస్తోంది.
ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. చంద్రబాబు స్లీపర్ సెల్స్ చచ్చిపోతూ వస్తున్నాయని.. ఇవాళ అడ్డగోలుగా దొరికారని ఆయన వ్యాఖ్యానించారు.
లోక్సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్లో పంచుకున్నారు.
ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉంది.