మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ సంఘటన తర్వాత, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్ను సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి పోషేరీలోని కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం, వైద్య కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది, విద్యార్థులు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న అనంతరం పోలీసులను అక్కడ మోహరించారు. ఈ ఘటనపై సోమవారం రాత్రి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read:Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన ర్యాగింగ్తో ముడిపడి ఉండవచ్చని తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు. నాసిక్కు చెందిన మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం, బురఖా ధరించిన ఓ యువతి హాస్టల్లోని మరో విద్యార్థినిని నమాజ్ చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం తన కుటుంబానికి సమాచారం అందించిందని పోలీసు అధికారి తెలిపారు. కళాశాల యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె విశ్వ హిందూ పరిషత్ను సంప్రదించిందన్నారు.
Also Read:గిన్నెలు కడిగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? అయితే మీకు జబ్బులు రావడం ఖాయం.!
పాల్ఘర్ పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ముఖ్ క్యాంపస్ను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), మహారాష్ట్ర ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మేము కేసు నమోదు చేశాము అని తెలిపారు. నిందితులను గుర్తించడానికి మేము సిసిటివి ఫుటేజ్లను స్కాన్ చేస్తున్నాము, ఇతర విద్యార్థుల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నాము, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.