కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్ కోర్టులు ముందస్తు అరెస్టు బెయిల్ మంజూరు చేయగలవని, అది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక రాష్ట్రంలో నేరం జరిగితే మరో రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఈ ప్రకటన చేసింది.
జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియోలో ఒక జంట నదిలో కలిసి స్నానం చేస్తుండగా.. ఉన్నట్టుండి ఓ కోతి వారి దగ్గరికి వచ్చింది. అయితే వారిద్దరు కలిసి స్నానం చేయడం ఆ కోతికి నచ్చలేదేమో. అందులో నుంచి వెళ్లేదాకా…
నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు మోసం చేశాయి..బీజేపీ ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. breaking news, latest news, telugu news, amit shah, telangana elections 2023
మానవుడి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం జీవనశైలి, ఆహారం. కొలెస్ట్రాల్లో రెండు రకాలున్నాయి.. ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.