తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వడివడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్కు నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్ఎస్కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. బీఆర్ఎస్కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని…
టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్…
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కు మద్దతుగా పట్టణంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు బంధు వంటి పథకాలు కొనసాగాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును మళ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సోమవారం అన్నారు. యాదగిరిగుట్ట, భోంగీర్, మిర్యాలగూడలో జరిగిన…
భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో భారత్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ముగిసింది. ఆ తర్వాత అభిమానులు ఎదురుచూసేది ఐపీఎల్ కోసం. 2024 ఐపీఎల్ వేలం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అందులో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురవడం…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడు 45వ రోజుకు చేరుకుంది. అయితే అక్టోబర్ 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్ సైన్యం ఇంకా కనుగొనలేకపోయింది. గత వారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యాహ్యా సిన్వార్ను దూషించారు. అతనిని జర్మన్ నియంత హిట్లర్తో పోల్చారు. యాహ్యా సిన్వార్ హిట్లర్లా దాక్కుంటున్నాడని, గాజా ప్రజలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి పరిష్కారం కనుగొనడానికి చైనా మిడిల్ ఈస్ట్ దేశాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్పై నిందలు మోపాయి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల ఉనికిని తొలగించాలని కోరుకుంటోందని చెప్పారు. సమావేశంలో అన్ని ఇబ్బందులకు ఇజ్రాయెల్ను నిందించడం ఎటువంటి పరిష్కారాన్ని ఇవ్వదు.