ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర…
మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్పై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారారని ఆరోపించారు. వచ్చిన ప్రతి ఫైలుపై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నారని.. ఇది సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్తే.. వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీని వైసీపీ…
అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ…
ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం నాడు ఏలూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన చేపట్టారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.20 నోటుతో పాటు ఓ మజ్జిగ ప్యాకెట్ అందించారు. పెంచిన ఛార్జీలను ప్రయాణికులు భరించలేకపోతున్నారని చెప్పేందుకు రూ.20 ఇచ్చినట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మరోవైపు ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలను…
టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మంనతాలు జరిపారు. అనంతరం ఆయన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల హైదరాబాద్లోని నివాసంలోనే ఉంటున్నారు. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల అనంతరం ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణ జన్మదినం. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న చంద్రబాబు ఈ సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి…
ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. పీకే ఇచ్చిన నివేదికలో తన ప్రభుత్వ పతనమైందని సీఎం జగన్కు తెలిసిందని అందుకే సీఎం జగన్ ఫస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని పయ్యావుల ఆరోపించారు. తాను బలంగా ఉన్నాను అనే ప్రయత్నం సీఎం చేస్తున్నారని.. కానీ తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి పీకుడు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా సీఎం జగన్ ఏం పీకారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి…
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. ఏపీకి జగన్ లాంటి సీఎం ఉండటమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆయన రివర్స్ పంచ్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు చెప్పిన్నట్లు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన సీఎం జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే.. తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారని…
ఏపీలో త్వరలో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు ప్రస్తుత కేబినెట్ సభ్యులు గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్కు సమర్పించారు. అయితే మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ కేబినెట్లోని 24 మంది అసమర్థులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారని ఆయన విమర్శలు చేశారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా ఓ…