ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం నాడు ఏలూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన చేపట్టారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.20 నోటుతో పాటు ఓ మజ్జిగ ప్యాకెట్ అందించారు. పెంచిన ఛార్జీలను ప్రయాణికులు భరించలేకపోతున్నారని చెప్పేందుకు రూ.20 ఇచ్చినట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
మరోవైపు ఉగాది సందర్భంగా విద్యుత్ ఛార్జీలను పెంచిన ఏపీ ప్రభుత్వం.. గుడ్ఫ్రైడే సందర్భంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచిందంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు తాము పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై బస్టాప్ వద్ద ప్రజలకు టీడీపీ నేతలు అవగాహన కల్పిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Srikakulam: వైరల్ వీడియో.. వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి ధర్మాన