తెలంగాణలో విద్యాసంస్థలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. వానలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. పాఠశాలలతో పాటు కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోనున్నాయి. అయితే గత వారం 11వ తేదీన భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ.. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈనేపథ్యంలో తిరిగి నేటి (సోమవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వారం రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్నాయి.…
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు.…
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకేరోజు అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటిస్తున్నారు. కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోనుండగా.. గవర్నర్ రైలు మార్గంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
* తిరుమలలో నేడు ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ.. ఉదయం శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ.. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు * బాపట్ల జిల్లా: నేడు రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన కుటుంబాలను పరామర్శించనున్న టీడీపీ నేతలు.. మద్యం మరణాలపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన * నంద్యాల: నేడు ఆత్మకూరులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న ఎమ్మెల్యే…