Telangana Coronavirus: హడలెత్తిస్తున్న కరోనా.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా ఏడు రెట్లు పెరిగాయి. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రోజున 493 మందికి పాజిటివ్గా తేలింది. గురువారంతో పోల్చుకుంటే హైదరాబాద్ జిల్లాలో సుమారు 50 కేసులు అధికమయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కోలుకున్న వారి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్నటి రోజైన శుక్రవారం 99.07 శాతం నమోదు కావడంతో భయాందోళన చెందుతున్నారు. అయితే మరోవైపు 219 మంది కోవిడ్ బారినుంచి సురక్షితంగా బయటపడ్డారు. నిన్న నగరంలో 366 కేసులు, రంగారెడ్డిలో 40, మేడ్చల్ మల్కాజిగిరిలో 34 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని, కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు అధికారులు .
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డీపీహెచ్ శ్రీనివాసరావు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రకటించారు. ఒకవైపు కరోనా కేసులు, మరోవైపు డెంగ్యూ వ్యాపిస్తుండటంతో.. ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచించారు. నగరవాసులు ఖచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయినా కూడా ప్రమాదం లేదు.. కానీ.. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రానున్న 7, 8 నెలల్లో కోవిడ్ పూర్తీగా తగ్గిపోతుందని డీపీహెచ్ శ్రీనివాసరావు ప్రజలకు తెలిపారు. అయితే కరోనాతో పిల్లలకు మొదటి నుంచి ఇబ్బంది లేదని, కొవిడ్ పాజిటివ్ వచ్చినా జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వివరించారు. కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నందున స్కూల్కు వెళ్లే పిల్లలు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
కోవిడ్ కేసులపై జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో బీఏ-2, బీఏ-4, బీఏ-5 ఎక్కువగా ఉంటున్నాయని, అందులో బీఏ-4, బీఏ-5 వేరియంట్లు నేరుగా ఊపిరితిత్తుల కణాలపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. కావున ప్రజలందరు దీని బారినుంచి తగు జాగ్రత్తు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Health Tips: సోరకాయ తింటున్నారా?.. ఇవి పాటించకపోతే ప్రాణానికే ప్రమాదం!
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!