నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు.…
మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీచేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు విజయం మాదేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండడంపై పెద్ద చర్చే జరిగింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలపై రేవంత్రెడ్డి అప్పుడే చేతులు ఎత్తేశారని…
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్న ఆయన వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. ముందుగా చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఆగస్టు 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎంత మంది నాయకులను సంప్రదించారు, పార్టీలో చేరేందుకు ఎవరెవరు సంసిద్ధత వ్యక్తం చేశారన్న అంశాలను చేరికల కమిటీ సభ్యులు చుగ్ కు వివరణ…
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ బహిరంగ లేఖ రాసారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ , పట్టణపేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్హెచ్జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను…
* నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు గోషామహల్లో బీజేపీ ర్యాలీ, ఆకాశ్పురి నుంచి ధూల్పేట్ వరకు బీజేపీ బైక్ ర్యాలీ, 2 వేలకు పైగా జాతీయ జెండాలు పంపిణీ చేయనున్న బీజేపీ నేతలు * ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ, నేడు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనున్న నల్గొండ నేతలు * ప్రకాశం…
* నేడు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం, కేబినెట్ ముందుకు వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా బిల్లు, అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా చట్ట సవరణ, ఇప్పటికే కామన్ బోర్డు ఏర్పాటు చేసిన సర్కార్ * నేడు బాపట్లలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యాదీవెన పథకం మూడో త్రైమాసిక నిధులను విడుదల చెయ్యనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో పన్నులను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండో విడత పన్నుల వాటాను విడుదల చేసింది. తొలి వాటా కింద దేశంలోని…
* నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం, రాజ్భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్ * భారత ఉపరాష్ట్రపతిగా నేటితో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం, రేపు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు, రేపటి నుంచి ఆర్జిత సేవలు పున:రుద్ధరణ * అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు విలీన మండలాల్లో కేంద్ర బృందం పర్యటన, రంప చోడవరం నియోజకవర్గంలోని చింతూరు, ఎటపాక,…
ఓవైపు గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పాటు.. మరోవైపు.. కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది.. దీంతో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 2,04,895 క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండగా.. 8 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఔట్ ఫ్లోగా 2,85,724 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..…