ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోంది విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్…
Jithender Reddy: తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్నారు.. మోడీ హామీలు అమలు చేయకపోవడంతో పాటు.. ఆయన పాలనలో చేసింది ఏమీ లేదంటూ పదునైన పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే.. కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజకీయంలో ఓ బచ్చా అని పేర్కొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ చిటికెన…
Police License: హైదరాబాద్లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పట్లు,…
అర్ధరాత్రి గాంధీభవన్లో ఉద్రిక్తత.. హైదరాబాద్లోని గాంధీ భవన్లో అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనను భగ్నం చేశారు పోలీసులు.. ఎన్ఎస్యూఐ నేత బల్మురి వెంకట్, కార్పొరేటర్ విజయ రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు.. అయితే, మాకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.. 1600/800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయిన అభ్యర్థులను.. ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని ఆందోళనకు చేశారు.. లాంగ్…
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది.. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఈజిప్టు అధ్యక్షుడు భేటీ.. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చ * ఢిల్లీ: నేడు పోలవరంపై సీడబ్ల్యూసీ సమావేశం.. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, ఒడిశా; మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు * ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ విడుదల.. 100 దేశాల్లో విడుదల కానున్న మూవీ.. పఠాన్ మూవీకి 4.19 లక్షల అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ * అమరావతి: డా.…