పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది… తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం…
Teachers Transfers: తెలంగాణలో రేపటి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్ లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు –…
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు.
కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు.. తెలంగాణ రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్భవరన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఎంతో అంకితభావం…
* నేడు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగనున్న రిపబ్లిక్ డే కార్యక్రమం.. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగనున్న పరేడ్ * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయు సేన, నావీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతు.. జాతీయ గీతం ఆలాపన సంధర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే…
Etela Rajender: తెలంగాణలో త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నాడు.. బండి సంజయ్ని మార్చేసి.. ఆయన స్థానంలో ఈటల రాజేందర్ను అధ్యక్షుడిగా నియమిస్తారు..! ఇలా పెద్ద ప్రచారమే జరుగుతోంది.. సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనే ఈ చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, ఇవాళ హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని జరుగుతున్న ప్రచారానికి నేనేలా బాధ్యుడిని అని ప్రశ్నించారు.. అసలు నాకు సంబంధం లేదని తేల్చేశారు..…
Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచిది.. ఇక, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అయితే, మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు తెలిపారు జీపీ.. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. టౌన్ ప్లానింగ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయని.. మాస్టర్…