Telangana : బిగ్ న్యూస్.. చెరువుల పరిరక్షణలో కీలక మలుపు.. భూమి కోల్పోయేవారికి 400% వరకు భారీ పరిహారం.!
- చెరువులు-నాళాల పరిరక్షణకు నూతన TDR విధానం
- భూ యజమానులకు 200% నుంచి 400% వరకు భారీ లాభం
- రియల్ ఎస్టేట్ బిల్డర్లు కోసం TDR తప్పనిసరి వినియోగం
- వరదల నివారణతో పాటు పర్యావరణ లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు, నాళాల అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారుతున్న తరుణంలో, మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి (MAUD) శాఖ వినూత్నమైన TDR (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నూతన విధానం ప్రకారం, నగరంలోని చెరువులు , నాళాల పరిరక్షణ కోసం తమ పట్టా భూములను వదులుకునే వారికి ప్రభుత్వం భారీ స్థాయిలో పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది. చెరువుల ఎఫ్.టి.ఎల్ (FTL) పరిధిలో భూమి కోల్పోయిన వారికి 200 శాతం, బఫర్ జోన్ పరిధిలో భూమి ఇచ్చే వారికి 300 శాతం, బఫర్ జోన్ వెలుపల లేదా నాళాల వెడల్పు పెంపు కోసం భూమి అప్పగించే వారికి ఏకంగా 400 శాతం TDR అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
ఈ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, కేవలం సరైన రెవెన్యూ పత్రాలు , యాజమాన్య హక్కులు ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం కల్పిస్తారు. HMDA, GHMC, HYDRA , MRDCL వంటి ప్రభుత్వ సంస్థలు చేపట్టే పునరుద్ధరణ పనుల కోసం భూమిని అప్పగించిన వెంటనే ఈ TDR సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఒకవేళ సదరు భూమి ఏదైనా వివాదంలో ఉంటే, ఆ సర్టిఫికెట్లను ప్రత్యేక TDR బ్యాంక్లో ఉంచి, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత అసలైన యజమానికి అందజేస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి నగదు రూపంలో భూసేకరణ భారం తగ్గడమే కాకుండా, భూమి కోల్పోయిన రైతులకు లేదా యజమానులకు మార్కెట్ విలువ కంటే రెట్టింపు స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. ఈ చర్య ద్వారా నగరంలోని జలవనరులను కాపాడటంతో పాటు వరదల ముప్పును శాశ్వతంగా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, ఈ TDR సర్టిఫికెట్లకు మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఇకపై నగరంలో 10 అంతస్తులకు మించి నిర్మించే ప్రతి హైరైజ్ భవనంలో, మొత్తం నిర్మిత ప్రాంతం (Built-up Area)లో 10 శాతాన్ని తప్పనిసరిగా TDR ద్వారానే పొందాలని నిబంధన విధించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు తప్పనిసరిగా భూమి కోల్పోయిన బాధితుల నుంచి ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, తద్వారా బాధితులకు త్వరితగతిన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా కాకుండా, భూ యజమానులకు లాభదాయకమైన అవకాశంగా మార్చడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం. సుప్రీం కోర్ట్ , గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూనే, ప్రజలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో , పర్యావరణ పరిరక్షణలో కొత్త మార్పులకు నాంది పలకనుంది.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?