తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన జరిగింది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి చేసి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్ను చేధించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్ చేశారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జేపీ నడ్డా ఫోన్ చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే.. తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను.. అయితే పార్టీ మరోసారి నాపై ఈ బాధ్యత పెట్టింది.. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచా.. పార్టీని ఎదీ ఎపుడు అడగలేదు అని కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్ల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్... పార్టీలో ఓబీసీ లకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే..ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టం.. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. బీసీలు ఇతర రాజకీయ పార్టీలలో గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు…
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.
ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు.
Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.
Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే… ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే… అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని…