AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను…
డయల్ 100కు ఫోన్.. సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్..! లిక్కర్లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు…
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఏపీలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏకి ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించనుంది . అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం…
StoryBoard: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయంతో.. దేశం మొత్తం ఇటువైపు తిరిగి చూస్తోంది. ఇప్పిటకే బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలన్న జాతీయ స్థాయి డిమాండ్ కు.. ఇక్కడ మన్నన దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, కేంద్రం కూడా బీసీల లెక్కలు తీసి.. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లివ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక వచ్చేదాకా బీసీలకు అసలు రిజర్వేషన్లే లేవని, ఆ తర్వాత…
సీట్ల వేటలో సిద్ధాంతాలు మరుగునపడిపోయాయా? చావో రేవో ఒకరితోనే… అనే స్థాయి నుంచి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళవైపేనంటూ ఎదురు చూసే స్థాయికి వాళ్ళ రాజకీయం దిగజారిపోయిందా? అది కూడా… ఒకే రకమైన ఎన్నికల్లో… ఒకేటైంలో మండలానికో పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఏమని పిలవాలి? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ పార్టీ చేస్తోందా పని? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలదే హవా. జిల్లా వరకు వాళ్ళ మాటే శాసనంగా నడిచేది. అవి…
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు శుభవార్త. మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, 4 వారాల వ్యవధిలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి హాజరై, హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు.