What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం..
* నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.. మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు సీతారాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగసుందరంగా భద్రాచలం పట్టణం
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
* నేడు హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి సుల్తాన్బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు.. శోభయాత్రకు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత..
* భద్రాచలం కి చేరుకున్న లక్షలాదిమంది భక్తులు .. నిన్న సాయంత్రం వచ్చే స్వామివారి దర్శనానికి భారీ క్యూలు .. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భద్రాచలం పట్టణం .. రంగురంగుల వెలుగులలో దేదీప్యమానంగా వెలుగుతున్న భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం
* నేడు భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన .. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోనున్న సీఎం .. రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేయనున్న సీఎం.. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి.
* నిజమాబాద్ : జిల్లాలో నేడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన.. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ పై కీలక ప్రకటన చేసే అవకాశం.. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ తేదీ ప్రకటన పై సర్వత్రా ఆసక్తి. ఏ స్థానం నుంచి పోటీ పై స్పష్టత ఇవ్వనున్న జాగృతి అధ్యక్షురాలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేయనున్న కవిత.
* నేడు శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం.. పాతాళగంగ దగ్గర ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణం.. సీతారాములోరికి విశేష పూజలు, కల్యాణమహోత్సవం..
* నిజామాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన .. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్న మహేష్ గౌడ్.
* నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి .. అందంగా ముస్తాబు చేసిన రామాలయాలు.. సుభాష్ నగర్ రామాలయం, ఖిల్లా రామాలయంలో, పెద్ద రాం మందిరం లో సీతా రాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు.
* నిజామాబాద్ : నేడు మద్యం దుకాణాలు బంద్.. శ్రీరామ నవమి సందర్భంగా ముందస్తు చర్యల లో భాగంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు బంద్
* రాజన్న సిరిసిల్ల జిల్లా: శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం.. ఆలయ ప్రాంగణంలోనీ శివార్చన వేదిక వద్ద రాములోరి కళ్యాణం.. శివార్చన వేదికపై రంగు రంగు పూలతో అలంకరించిన స్వామి వారి కళ్యాణ వేదిక.. కల్యాణ వేదిక సిద్ధం చేసిన ఆలయ అధికారులు.. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
* మంచిర్యాల: నేడు జిల్లా లో మంత్రి వివేక్ పర్యటన.. క్యాతనపల్లి, మందమర్రి లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
* నిర్మల్: భైంసా లో నేడు శ్రీరామ నవమి, శోభా యాత్ర. సమస్యాత్మక ప్రాంతం కావడం తో పటిష్ట భద్రత. 350 మంది తో బందోబస్తు ఏర్పాటు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శోభాయాత్ర ముగించాలని హై కోర్టు ఆదేశాలు ఉన్నట్లు చెపుతున్న పోలీసులు.
* అమరావతి : తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు.. ఉదయం 9 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలలో పాల్గొననున్న పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం .. రాత్రి 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం
* విజయనగరం: నేడు రామతీర్థం లో సీతారాముల కళ్యాణం.. వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న. భక్తులు.. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. స్వామి వారికి పట్డు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
* కర్నూలు: నేడు దేవనకొండ( మం) దత్తత గ్రామం కప్పట్రాళ్లలో ఏపీ ఈగల్ ఐ.జి. పర్యటన. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న రవి కృష్ణ
* కర్నూలు: నేడు శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్న దేవస్థానం.. పాతాళగంగ వద్ద గల ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శ్రీసీతారామస్వామికి వైభవంగా కళ్యాణం.. శ్రీసీతారాములకి విశేష పూజలు,కళ్యాణ మహోత్సవం
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల కృష్ణతేజ అతిధి గృహం వరకు క్యూ లైన్లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,600 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,292 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!