GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Scam: రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జీఎస్టీ మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ అఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్ (DGGI) అధికారులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సిండికేట్ ద్వారా సుమారు రూ. 217 కోట్ల ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) దోపిడీ జరిగినట్లు నిర్ధారణ అయింది. అధికారులు నిర్వహించిన దర్యాప్తులో మొత్తం 72 నకిలీ (షెల్) కంపెనీలు గుర్తించారు. ఇవి కేవలం కాగితాల మీద మాత్రమే ఉండి, ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి భారీగా ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నట్లు బయటపడింది.
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
ఈ కుంభకోణంలో నిందితులు చాకచక్యంగా వ్యవహరించారు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేశారు. ఇంకా ఖాళీ షాపులను అద్దెకు తీసుకుని తాత్కాలిక కార్యాలయాలుగా చూపించారు. దీనితో డిజిటల్ లాగిన్ ల ద్వారా ఇన్వాయిస్ లు జారీ చేశారు. ఈ పద్ధతి ద్వారా దాదాపు రూ. 1,472 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, అందులో రూ. 217 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్కామ్కు ప్రధాన సూత్రధారి ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజి రెడ్డి) పరారీలో ఉన్నాడు. కాగా రామావత్ నాగరాజు నాయక్, సిద్దిగోని ప్రభాకర్ అనే ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు.
US-Iran War: ఇరాన్లో ఎవరూ ఉండొద్దు.. తక్షణమే ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
వీరు నకిలీ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, డమ్మీ యజమానులను ఏర్పాటు చేయడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. పట్టుబడిన నిందితులపై CGST Act 2017 కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ స్కామ్ లో లబ్ధి పొందిన మరిన్ని వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?