* 29వ రోజుకు చేరిన యూఎస్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు.. ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. టెల్అవీవ్, పరిసర ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి.. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్
* నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం.. తొలి మ్యాచ్లో తలపడనున్న ఆర్సీబీ-సన్రైజర్స్.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
* తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం.. మరోవైపు ఏపీ, తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అమరావతికి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ప్రత్యేక భేటీ.. అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించనున్న సీఎం చంద్రబాబు.. తీర్మానంపై 4 గంటల పాటు సభలో చర్చ.. తీర్మానం ఆమోదం తర్వాత వెంటనే కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం
* హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. పంచాయతీరాజ్ మూడో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి సీతక్క.. పేరెంట్స్ మానిటరింగ్ సపోర్ట్ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి అడ్లూరి.. పేరెంట్స్ను పట్టించుకోకపోతే ఉద్యోగుల వేతనం నుంచి కోత పెట్టనున్న సర్కార్
* మార్కాపురం బస్సు ప్రమాద మృతుల డీఎన్ఏ నివేదికలు సిద్ధం.. డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు.. ఇవాళ మృతదేహాలను బంధువులక అప్పగించనున్న అధికారులు
* నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన.. తంగళ్లపల్లి, ముస్తాబాద్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ
* భద్రాద్రి: నేడు మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పట్టు వస్త్రాలను సమర్పించనున్న గవర్నర్ దంపతులు… హాజరు కానున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
* నిర్మల్ జిల్లా: ఇవాళ నిర్మల్ బంద్కు బీజేపీ పిలుపు.. నిర్మల్ లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా నిర్మల్ పట్టణ బంద్ కు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు.
* నిజామాబాద్: నేడు మున్సిపల్ కార్పొరేషన్ తొలి కౌన్సిల్ సమావేశం .. మేయర్ ఉమారాణి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అధికారులు. సమావేశానికి హాజరుకానున్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్
* విజయవాడ: మధ్యాహ్నం 3 గంటలకు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం.. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అధ్యక్షతన సమావేశం.. పాల్గొననున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు.. దేవస్థానం అభివృద్ధి పనులపై కీలక చర్చ
* శ్రీ సత్యసాయి : శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరాముని పట్టాభిషేకం
* శ్రీ సత్యసాయి : నీలకంఠాపురం లో శ్రీ సీతారాములకళ్యాణం తో పాటు ఉచిత సామూహిక వివాహాలు చేయనున్న సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు.. సాయంత్రం ఐదున్నర గంటలకు నీరాజన విశ్వకేశ ఆరాధనతో ఉత్సవాలు ప్రారంభం.. ఈనెల 29వ తేదీన వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం.. ఏప్రిల్ మూడో తేదీ వరకు జరుగనున్న. కళ్యాణ మహోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
* తిరుమల: 30 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,526 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,780 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు