తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. MISS WORLD-2025 కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే 10న మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. Also…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం రోజు విజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆందోళన జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంఛార్జ్ కేకే మహేందర్ స్టేజీ మీద ఉండగానే రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మాట్లాడుతుండగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
TS 10th Class Results: పదవ తరగతి పరీక్ష ఫలితాలకు రంగం సిద్ధం అయింది. ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు రిజల్ట్స్ విడుదల చేస్తామని విద్యా శాఖ వెల్లడించింది.
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు.
Basara Triple IT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగు మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోని కాంట్రాక్టర్లకే మళ్ళీ అప్పగించేలా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నాలుగు మెస్ లకు ఆన్ లైన్ టెండర్లు పిలిచింది. మార్చి 20వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే, వచ్చిన ప్రైస్ బిడ్ లను తెరిచి టెక్నికల్ ప్రాసెస్ పూర్తి చేసింది కమిటీ.