ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్లు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీరియస్గా ముందుకు పోతోంది. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ... తీగలు ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే... బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది. దీంతో... ఆ పార్టీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మా ఫోన్ కాల్స్ని కూడా వినేశారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్…
Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్లో చికిత్స పొందుతూ మరణించారు. గత…
CM Revanth Reddy : సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్సిటీ దివ్యశ్రీ భవన్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్లో…
KTR Sends Legal Notice: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.
తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది.
ఏడాదిన్నర టైం ఇచ్చినా.. వీళ్ళలో మార్పు లేదు, ఇకమీదట కూడా అలాగే ఉంటే కుదరదని అనుకున్నారో, లేదంటే లేటెస్ట్ ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో క్లారిటీ వచ్చిందోగానీ.. ఈసారి హస్తిన ఫ్లైట్ దిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆయన కాన్ఫిడెంట్గా అడుగులేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక, ఉత్సాహం ఆపుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులైతే.
KTR Formula E-Car Race: ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఏసీబీకి సెల్ ఫోన్లు అప్పగించాలన్న దానిపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బలవంతంగా వ్యక్తిగతమైన సెల్ ఫోన్లు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి..