హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ గెలుపు.. ప్రజల గెలుపు అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా… చివరికి తామే గెలిచామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ పేరుతో తప్పించుకున్నారని… దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు. దళిత బంధు…
జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం)…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం.. ఇక, తెలంగాణలో మొదటల్లో వ్యాక్సిన్ లేక కొన్ని రోజులు వ్యాక్సిన్కు హాలిడేస్ ప్రకటించినా.. ఆ తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్లో వేగం పుంజుకుంది.. ఫస్ట్ డోస్ కొనసాగిస్తూనే.. ఫస్ట్ డోస్ తీసుకుని.. సెకండ్ డోస్ వేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నవారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అయితే, పండుగ సమయంలోనూ వ్యాక్సిన్కు హాలిడే ఇస్తూ వస్తున్నారు.. రేపు దీపావళి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో చెప్పుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు, సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ ప్రజల్లో చరిష్మా ఉన్న నేత లేరనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా…
ఈటల రాజేందర్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.. దీంతో.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు అయ్యింది.. అయితే, ఈ ఎన్నికల్లో విజయం క్రెడిట్ అంతా ఈటల రాజేందర్దే అనే చర్చ సాగుతోంది.. ఈటల లేకుండా హుజురాబాద్లో బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయని అని గణాంకాలు వేసేవారు కూడాలేకపోలేదు. అయితే, ఇవాళ ఈటల రాజేందర్తో కలిసి మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్.. ఈటల రాజేందర్ గెలుపు బీజేపీ గెలుపు…
తాజాగా వెలువడిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నాయి.. ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీని టార్గెట్ చేస్తూ సీనియర్లు విమర్శలు చేయడంతో.. ఇవాళ గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది.. అయితే, ఈ సమావేశానికి పార్టీపై విమర్శలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టగా.. పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం కొనసాగుతుండగానే.. మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతి సారి సమావేశానికి రాను.. నా…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే.. టీఆర్ఎస్ పోరాడా ఓడింది.. కానీ, కాంగ్రెస్ మాత్రం ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.. దీంతో.. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తుంది అధికార పక్షం.. దానికి తోడు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం రచ్చగా మారింది. అయితే, హుజురాబాద్లో పార్టీ ఘోర పరాజయంతో పాటు.. పీసీసీని టార్గెట్ చేస్తూ.. నేతలను చేసిన…
హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సెగ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తాకింది.. దానికి ప్రధాన కారణం.. హుజూరాబాద్ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్లో ఆయన సవాల్ చేయడమే.. అయితే, కాంగ్రెస్కు గతంలో వచ్చిన ఓట్లు రావాలి.. ఈటల గెలవాలి.. అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు గువ్వల.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడం.. ఈటల…