హైదరాబాద్లోని కొంపల్లిలో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ముందే రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. తమకు శిక్షణ తరగతుల పాసులు ఇవ్వలేదని ఆందోళన చేశాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి పాసులు ఇవ్వలేదని ఆరోపించాయి. బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులను కాదని కొత్త వారికి ఇచ్చారని మండిపడ్డాయి. పొన్నాల లక్ష్మయ్య మనుషులకు మాత్రమే ఇచ్చి తమను దూరం…
తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని… రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందని… కాబట్టి ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి…
హైదరాబాద్ ఫలక్ నుమాలో ఓ డ్యాన్సర్ అనుమానాస్పదంగా మరణించిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసిన ఫలక్ నుమా పోలీసులు. డాన్సర్ పై రేప్ జరిగిందని, అర్ధ నగ్నంగా పడి ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు పోలీసులు. READ ALSO ఫలక్నుమాలో దారుణం.. డ్యాన్సర్ గ్యాంగ్ రేప్? డ్యాన్సర్…
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉండగా.. వీటికి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 8 జత కానున్నాయి. దీంతో మొత్తం 18 కాలేజీల్లో సహాయ ఆచార్యులను నియమించనున్నారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. ‘సినతల్లి’కి ఇల్లు కట్టిస్తానని హామీ కొత్తగా నెలకొల్పనున్న…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాల విడుదలకానుంది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే…
హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్…
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్లో ఉండగా, 2021…
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్ సంస్థకు.. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేశారు. మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్కు జూన్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. తెలంగాణలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్రావు, ఎల్. రమణ, గుత్తా సుఖేందర్రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ రేసులో ముందున్నట్లు ప్రచారం జరగుతోంది. వీరితో పాటు మరికొంత మంది ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ…
తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్-చైనా సరిహద్దుల్లో జరుగుతోన్న పరిణామాలపై చేసిన వ్యాఖ్యలును తప్పుబడుతోంది భారతీయ జనతా పార్టీ.. కేసీఆర్పై దేశద్రోహి కింద కేసు నమోదు చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో హిమాచల్ప్రదేశ్ లో తోకముడిచిన సైన్యం అని మాట్లాడారని.. దీంతో.. కేసీఆర్ను దేశద్రోహి కింద కేసు చేయొచ్చు…