Home
Telangana
Telangana News
-
Pending Challans: వాహనదారులకు అలెర్ట్.. మరో 3 రోజులే డిస్కౌంట్ ఆఫర్..
తెలంగాణలో తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగియవచ్చింది.. ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం పెండింగ్లో ఉన్న చలాన్లకు ఇచ్చిన డిస్కౌంట్ క్లియర్ చేసే సమయం 15-4-2022 సాయంత్రంతో ముగుస్తుంది. ఇకపై… -
Weather Update: తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. ఇక, ఎల్లుండి ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో వర్షం పడుతుందని.. ఈ… -
Palla Rajeshwar Reddy: బండి సంజయ్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డ రాజేశ్వర్రెడ్డి..
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్..… -
Revanth Reddy: కేసీఆర్కు పీసీసీ చీఫ్ డెడ్లైన్..
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం… -
Cabinet: ముగుస్తున్న డెడ్లైన్… కేసీఆర్ కీలక నిర్ణయం..!?
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ.. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ * భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గవర్నర్ తమిళిసై పర్యటన.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లను కలవనున్న గవర్నర్, 3 గంటల పాటు గ్రామంలోని గిరిజనులతో గడపనున్న గవర్నర్ * నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం,… -
Maheshkumar Goud: తెలంగాణలో పట్టపగలు భూదోపిడీ
రాష్ట్రంలో పట్టపగలు భూదోపిడీ చేసి కంపెనీలకు కట్టబెడుతున్నారు. పేదల భూమి లాక్కోవలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 111 జీవో ఎత్తివేస్తే ఐదింతల భూమి రేటు పెరిగే అవకాశం ఉంది. పట్టపగలు భూ దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు కేసీఆర్ కుటుంబ సభ్యులవే అన్నారు. https://ntvtelugu.com/revanth-reddy-ten-questions-to-cm-kcr/ ఈ భూములపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ తెచ్చి రాష్ట్రంలో పివి నరసింహారావు… -
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ళపై రేవంత్ పది ప్రశ్నలు
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం సేకరణ పై మెలిక పెడుతున్న విషయం నిజం కాదా? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు.మీరే లేఖ… -
KCR: కేంద్రానికి కేసీఆర్ డెడ్లైన్.. 24 గంటల్లో తేల్చకపోతే..!
వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్కు 24 గంటల డెడ్లైన్ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి… -
LIVE: ఢిల్లీలో యుద్ధం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!