కరోనా థర్డ్ వేవ్ ముగిసి క్రమంగా తగ్గిపోయిన కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.. మరోవైపు.. ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఆదివారం 1,150 కొత్త కేసులు నమోదై.. నలుగురు మాత్రమే మృతిచెందగా.. ఇవాళ ఆ కేసుల సంఖ్య భారీగా పెరిగి 2,183కు చేరింది.. మరో 214 మంది మృతిచెందారు. నిన్నటి కంటే 90 శాతం కేసులు అధికంగా నమోదు కావడం కలవరపెట్టే అంశం.. దేశ…
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా…
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో రాయలసీమ ముఠా హల్చల్ చేసింది. ఖరీదైన స్టలం ఆక్రమణకు ప్రయత్నించింది ముఠా. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడిని నాయకత్వంలోని ముఠా ఈ అరాచకానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆదోనికి చెందిన 90మంది రౌడీలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమించేందుకు ముఠా ప్రయత్నించింది. వంద కోట్ల స్థలం ఆక్రమించేందుకు భూ మాఫియా పడగ విప్పింది. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా కిరాయి రౌడీలు మారణాయుధాలతో నగరానికి వచ్చారు.…
* నేటి నుంచి మూడ్రోజుల పాటు గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, నేడు గాంధీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని * నేడు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన.. స్కూళ్లు, ఆస్పత్రులను సందర్శించనున్న పంజాబ్ సీఎం బృందం * నేడు మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన, పిన్నమనేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వెంకయ్య * నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ భేటీ, టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపై చర్చించనున్న…
తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హస్తినకు చేరాయా? మళ్ళీ ఢిల్లీకి వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళి సై తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించినట్టు తెలుస్తోంది. పది రోజుల కిందటే రెండ్రోజుల పాటూ ఢిల్లీకి వెళ్లి వచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రధాని నరేంద్ర మోఢీ, కేంద్ర అమిత్ షాలతో గత పర్యటనలో భేటీ అయి పలు విషయాలు వారికి వివరించి వచ్చారు. రాష్ట్రంలోని పలు అంశాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు తమిళి సై సౌందరరాజన్. మరోసారి తమిళసై ఢిల్లీ…
తెలంగాణలో సంచలనం కలిగించిన సస్పెండైన హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్కు తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి తెలిపింది. అయితే రామకృష్ణ హత్యకు గురయిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని, పోలీసులు ఏం మాట్లాడడడం లేదని పేర్కొంది. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యం అయింది. తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య…
తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు. రాష్టంలో టీఆర్స్ ప్రభుత్వం వచ్చాక…
బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లకు పచ్చకామెర్లు సోకాయంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులపై ధరల భారం పెంచారని మండిపడ్డారు.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?, తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా…
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ…
మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్ఎస్ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు…