India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- ఉగ్రవాదం ఆపే దాకా సింధు జలాలు ఇవ్వం..
- సింధు ఒప్పందం నిలిచే ఉంటుంది..
- పాక్కు స్పష్టం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Indus Waters: సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా గగ్గోలు పెడుతోంది. పలువురు విదేశీ రాయబారులతో ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. మరోవైపు, పాక్ నేతలు భారత్ను, భారత నేతల్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ చెప్పింది. సరిహద్దులో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరు పాకిస్తాన్కు ఎలాంటి నీరు ఇచ్చేది లేదని చెప్పింది. అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని ‘‘నిలిపేవేత స్థితి’’లో ఉంటుందని స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 2025లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు నీరు ఇవ్వడం లేదని అంతర్జాతీయ సమాజానికి భారత్పై పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తోంది. సింధు జలాల కోసం సింధూ లోయ నాగరికత అసలు వారసులము తామే అంటూ ఒక కొత్త ప్రచారానికి తెర తీసింది. పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఏమీ మారదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ రోజు పాకిస్థాన్కు గుర్తుచేసింది.
Also Read
- New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
“సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందున IWT నిలిపివేయబడిన స్థితిలోనే ఉంది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా మరియు తిరుగులేని విధంగా విరమించుకోవాలి,” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో అన్నారు.
సింధు జలాల విషయంలో ఇటీవల పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత నిర్ణయాన్ని పాక్ తిరస్కరించిందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలన్నీ విఫలమైతే, పాకిస్థాన్ అణు ఆప్షన్ను పరిశీలించాల్సి ఉంటుంది.” అని హెచ్చరించే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!