India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- ఉగ్రవాదం ఆపే దాకా సింధు జలాలు ఇవ్వం..
- సింధు ఒప్పందం నిలిచే ఉంటుంది..
- పాక్కు స్పష్టం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Indus Waters: సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా గగ్గోలు పెడుతోంది. పలువురు విదేశీ రాయబారులతో ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. మరోవైపు, పాక్ నేతలు భారత్ను, భారత నేతల్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ చెప్పింది. సరిహద్దులో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరు పాకిస్తాన్కు ఎలాంటి నీరు ఇచ్చేది లేదని చెప్పింది. అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని ‘‘నిలిపేవేత స్థితి’’లో ఉంటుందని స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 2025లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు నీరు ఇవ్వడం లేదని అంతర్జాతీయ సమాజానికి భారత్పై పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తోంది. సింధు జలాల కోసం సింధూ లోయ నాగరికత అసలు వారసులము తామే అంటూ ఒక కొత్త ప్రచారానికి తెర తీసింది. పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఏమీ మారదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ రోజు పాకిస్థాన్కు గుర్తుచేసింది.
Also Read
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
“సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందున IWT నిలిపివేయబడిన స్థితిలోనే ఉంది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా మరియు తిరుగులేని విధంగా విరమించుకోవాలి,” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో అన్నారు.
సింధు జలాల విషయంలో ఇటీవల పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత నిర్ణయాన్ని పాక్ తిరస్కరించిందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలన్నీ విఫలమైతే, పాకిస్థాన్ అణు ఆప్షన్ను పరిశీలించాల్సి ఉంటుంది.” అని హెచ్చరించే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!