India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- ఉగ్రవాదం ఆపే దాకా సింధు జలాలు ఇవ్వం..
- సింధు ఒప్పందం నిలిచే ఉంటుంది..
- పాక్కు స్పష్టం చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Indus Waters: సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా గగ్గోలు పెడుతోంది. పలువురు విదేశీ రాయబారులతో ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. మరోవైపు, పాక్ నేతలు భారత్ను, భారత నేతల్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ చెప్పింది. సరిహద్దులో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరు పాకిస్తాన్కు ఎలాంటి నీరు ఇచ్చేది లేదని చెప్పింది. అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని ‘‘నిలిపేవేత స్థితి’’లో ఉంటుందని స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 2025లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు నీరు ఇవ్వడం లేదని అంతర్జాతీయ సమాజానికి భారత్పై పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తోంది. సింధు జలాల కోసం సింధూ లోయ నాగరికత అసలు వారసులము తామే అంటూ ఒక కొత్త ప్రచారానికి తెర తీసింది. పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఏమీ మారదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ రోజు పాకిస్థాన్కు గుర్తుచేసింది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
“సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందున IWT నిలిపివేయబడిన స్థితిలోనే ఉంది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా మరియు తిరుగులేని విధంగా విరమించుకోవాలి,” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో అన్నారు.
సింధు జలాల విషయంలో ఇటీవల పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత నిర్ణయాన్ని పాక్ తిరస్కరించిందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలన్నీ విఫలమైతే, పాకిస్థాన్ అణు ఆప్షన్ను పరిశీలించాల్సి ఉంటుంది.” అని హెచ్చరించే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!