Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: DaakuMaharaaj…
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి…
K Laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని ఎగవేతలే అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12 వేలకు కోత పెట్టిందని తెలిపారు. మాయమాటలు చెప్పి…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాజెక్టు తీసుకురావడంలో తన పాత్రను గుర్తు చేస్తూ అరుణ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును తెచ్చింది నేనే.. మా నాన్న పాలమూరు కోసం అనేక పోరాటాలు చేశారు, మా కుటుంబం జిల్లా కోసం ప్రాణాలు అర్పించిందని తెలిపారు. వారిని గుర్తుచేసే…
Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర…
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక…
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్లో బస చేసి…
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ ప్రభుత్వం కక్షసాధింపుల రాజకీయాలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పక్షపాత చర్యలకు పాల్పడి, ప్రతిపక్షాలను పూర్తిగా క్షీణింపజేసే కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలపాలుచేసి తమ పార్టీలోకి చేరుస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగతీసిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్…
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందా?”…