MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
- ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
- ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహణ
- మార్చి 3న ఓట్ల లెక్కింపు
MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు.
Also Read
Thandel : ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది : సాయి పల్లవి
ఎన్నికల ప్రక్రియ – ముఖ్యమైన తేదీలు
ఫిబ్రవరి 11: నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 13: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
ఫిబ్రవరి 27: పోలింగ్ నిర్వహణ
మార్చి 3: ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, అదే ప్రాంతంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct) అమలులోకి వస్తోంది.
ఎన్నికల ఏర్పాట్లు – పటిష్ట భద్రతా చర్యలు
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రధాన అంశాలను చర్చించారు.
ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ (Training) ఇవ్వాలని అధికారులకు సూచించారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్లో, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.
పోలింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవరోధాలు ఉంటే, అక్కడ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సర్టిఫికెట్లు జారీ చేసి, వారికీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. ఈ మేరకు, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి, నియమాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Tandel: ‘తండేల్’ జాతరలో స్టెప్పులు వేసిన నాగ చైతన్య , సాయి పల్లవి
తాజావార్తలు
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో