Home
Telangana Politics
Telangana Politics News
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao: అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు లక్ష్యాల్లో మార్పులు జరిగితే రైతుల భూములను తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంట్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం… -
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
KTR: రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని తాను లేఖ రాశానని తెలిపారు. సీఎంకు డబ్బు సంచులపై ఉన్న దృష్టి ధాన్యం సంచులపై కూడా ఉంటుందని భావించానని, కానీ ఇటీవల సీఎం నిర్వహించిన ప్రెస్మీట్ చూస్తే పరిస్థితి అర్థమైందని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని… -
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్టుపై వస్తున్న ఊహాగానాలను, దొడ్డిదారి లొంగుబాటు ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “మా పోలీసులు చెప్పిన వాస్తవాలనే మేము చెప్తాం. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే ఇంట్లోనో లేక పోలీస్ స్టేషన్కో వచ్చి అప్పగిస్తారు. అంతేగానీ, పోలీసులు రోడ్డుపై ‘నాకాబందీ’ (చెక్ పోస్ట్) నిర్వహిస్తుండగా దొరికితే.. దాన్ని ముందస్తు లొంగుబాటు అంటారా?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష నేతల తీరును తప్పుబడుతూ.. “ఇక్కడ కేటీఆర్… -
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
KTR: రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించిన కేటీఆర్, కొనుగోలు కేంద్రాల్లో రైతులు మరణిస్తున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.… -
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
Ramchander Rao: గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు సమాధానమిచ్చారు. "బండి సంజయ్ తప్పు చేస్తే పార్టీ చర్యలు… -
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
KTR : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు బండి భగీరథ్ ఉదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే కేంద్రమంత్రిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నిరంతరం “బేటీ బచావో.. బేటీ పడావో” అని చెప్తుంటారని, అయితే అవి కేవలం నినాదాలకే పరిమితమైతే దేశంలోని ఆడబిడ్డలకు న్యాయం జరగదని హితవు పలికారు. భారతదేశ చరిత్రలోనే… -
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Union Minister Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. రైతుల విషయంలో ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తాజాగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులు బ్యాంకుల్లో డిఫల్టర్లుగా మారారని.. రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందని… -
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Ponnam Prabhakar: ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారన్నారు. ఎన్నికలు పూర్తికాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసిందని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి… -
KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌస్లో నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ , ముఖ్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహిస్తున్న తరుణంలో, పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తు… -
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
K Kavitha : టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా, రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత ఆధ్వర్యంలో గతంలో కామారెడ్డిలో భారీ ఎత్తున రైల్ రోకో నిర్వహించారు. ఈ…
తాజావార్తలు
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
-
Preity Zinta: AI డీప్ఫేక్లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!