Off The Record: బ్యాలెట్ బాక్స్లు తెరవకముందే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు డిసైడవుతున్నారు వివిధ పార్టీల నాయకులు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… బీఆర్ఎస్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న పాయింట్ ఆసక్తికరంగా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను దక్కించుకుంది గులాబీ పార్టీ. దీంతో ఇప్పుడ ప్రతిపక్షంగా ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? అధిష్టానం మనసులో ఏముందంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. ఎన్నికల షెడ్యూలు రాకముందే…
Telangana BC reservations : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, దీనికి సంబంధించిన కీలక అప్డేట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. లోక్సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్…
Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో…
Minister Sridhar Babu : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తరుణంలో అధికార కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదిరింది. “ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాలి” అని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై అక్బరుద్దీన్ చేసిన క్లెయిమ్ను ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం మరొకరి భిక్ష కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్…
Akbaruddin : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంఐఎం స్టార్ క్యాంపెయినర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వేదికగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. పనులు కావాలన్నా, అధికారం…
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయ భవిష్యత్తు , జాతీయ స్థాయి ఎన్నికల విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో, 2029లో దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల విభజన, రాష్ట్రాల వాటాపై ఆయన తన గళాన్ని వినిపించారు. రాబోయే డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై రేవంత్ రెడ్డి…
Telangana municipal elections 2026 : తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్గా భావిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ఇన్నాళ్లూ మార్మోగిన వీధులన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్లో ఓటర్లు ఎవరికి…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా , రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారాన్ని చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. PNB Recruitment…
OFF THE RECORD: కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి కిషన్రావు అని ఎందుకు అన్నారు సీఎం రేవంత్రెడ్డి? ఒక ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ మీద ఆ స్థాయి కామెంట్ చేయడం వెనకున్న బలమైన కారణాలేంటి? ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? మధ్యలో ఉన్నదెవరు? అసలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఇప్పుడెలా కనిపిస్తోంది? Off The Record : వైసీపీలో అంబటి ఒంటరి అయ్యారా? కీలక నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరడం,…
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న…