Home
Telangana Politics
Telangana Politics News
-
CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
CM Revanth Reddy : హైదరాబాద్ నగర , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకుస్థాపనల వేదికగా కేంద్ర మంత్రిపై విమర్శల జడివాన కురిపించిన సీఎం, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా అని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి… -
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా, రాబోయే రోజుల్లో వంద సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. రైతు బంధుపై నిర్లక్ష్యం.. కేసీఆర్ పాలనే ఆదర్శం… -
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
Kiren Rijiju: ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన ప్రేరేపిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశాన్ని ఇలా విభజించొద్దని హితవు పలికారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా మనమంతా భారతీయులమే అని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి తన పన్నుల్ని వినియోగిస్తున్నారని, దక్షిణాది ప్రజల్ని ‘‘ద్వితీయ శ్రేణి పౌరులు’’గా చూస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్గా రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఇదే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల… -
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి నది అనుసంధాన ప్రక్రియలో తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నదుల అనుసంధానం గోదావరి-నల్లమల సాగర్ , పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధాన ప్రతిపాదనలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధమైన అనుసంధానం… -
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Chief Minister Revanth Reddy: తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పరిపాలనలో కామన్ సెన్స్ అనేదే ముఖ్యమని.. కామన్ సెన్స్తో సమస్యలు పరిష్కారం చేసేవే ఎక్కువ అని తెలిపారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ మీడియా పీపుల్స్ను కూడా మీడియా సమావేశానికి పిలుస్తానన్నారు. వాళ్ళ మైండ్ సెంట్ ఏంటో తెలుసుకుంటానని చెప్పారు. తనకు వేరే ఏ పని లేదని.. 16 నుంచి 18 గంటలు పని చేస్తానన్నారు.… -
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
CM Revanth Reddy : జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డగా గత రెండు రోజులుగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించానని తెలిపిన ఆయన, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు అనుభవించిన ఈ గడ్డపై గతంలో కేసీఆర్కు ఇక్కడ ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా రాజకీయ వలస వచ్చాడని, అయినప్పటికీ ఇక్కడి ప్రజలు… -
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ మధ్య తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చ మొదలైంది.. దీంతో, ఆ తర్వాత తెలంగాణపై తన వైఖరిని చెబుతూ వచ్చిన ఆయన.. ఇప్పుడు తెలంగాణ అంశంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చర్చనీయాంశంగా మారిన సెక్షన్-8 అమలుపై తాను గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు గతంలో తాను చేసిన… -
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Ramchander Rao: కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జెన్జీ ఎప్పుడూ ఈ దేశంతో ఉంటుందన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ, రాష్ట్ర రాజకీయాలు, స్థితిగతుల గురించి మాట్లాడారు. ఎస్ఐఆర్ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అని.. ఇది ప్రభుత్వం చేస్తున్నది కాదన్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తోందని చెప్పారు. ఇక తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ… -
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
Pawan Kalyan: మరోసారి తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన పవన్.. అమరావతిలోని పొట్టి శ్రీరాములు స్మృతి వనంలోని మెమోరియల్ పార్క్ను సందర్శించారు.. పార్టీ సేవా గళం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులతో కలిసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అనుబంధ సంస్థగా ఇటీవల ఏర్పాటు చేసిన ‘సేవా గళం’ కమిటీకి సంబంధించిన… -
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
CM Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన సభలపై అక్కడి రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ సభలను అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని గుర్తు చేశారు. అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని…
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!