Pargi Municipal : పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం వికారాబాద్ జిల్లా పరిగిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం, స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా మారడంతో ఇరు పార్టీల మధ్య ‘వార్డ్’ వార్ కాస్తా ‘కిడ్నాప్’ డ్రామాకు దారితీసింది. పరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 వార్డుల్లో విజయం సాధించి సమానంగా నిలిచాయి. దీంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్ర…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం , పీసీసీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి, సంక్షేమానికి , విశ్వసనీయతకే ప్రాధాన్యత ఇస్తారని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై…
KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని విర్రవీగుతున్నారని, చరిత్రలో ఇలాంటి వారు ఎందరో వచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి మహామహులనే ప్రజలు…
Harish Rao : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార పక్షం ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని ఆయన మండిపడ్డారు. దాదాపు 700కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమని ఆయన అభివర్ణించారు. అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, డబ్బు రాజకీయాలకు…
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లకే తాను బదులిస్తున్నానని…
Off The Record: తెలంగాణలో పురపోరు ముగిసింది. పట్టణ ఓటర్ తీర్పు చెప్పేశాడు. ఇక రిజల్ట్ కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా వెయిటింగ్. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ వాడేశారు లీడర్స్. ఎవరికి వారు గెలుపు ఓటముల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరే నడిచింది.…
Off The Record: బ్యాలెట్ బాక్స్లు తెరవకముందే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు డిసైడవుతున్నారు వివిధ పార్టీల నాయకులు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… బీఆర్ఎస్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న పాయింట్ ఆసక్తికరంగా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను దక్కించుకుంది గులాబీ పార్టీ. దీంతో ఇప్పుడ ప్రతిపక్షంగా ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? అధిష్టానం మనసులో ఏముందంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. ఎన్నికల షెడ్యూలు రాకముందే…
Telangana BC reservations : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, దీనికి సంబంధించిన కీలక అప్డేట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. లోక్సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్…
Jadcherla MLA Anirudh Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ను ఒక “నటుడు”గా అభివర్ణిస్తూ, ఆయన రాజకీయ విజయాల వెనుక ఎప్పుడూ ఒక “నిర్మాత” (ప్రొడ్యూసర్) ఉంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత బలంతో కాకుండా, ఇతర పార్టీల అండతోనే రాజకీయాల్లో…
Minister Sridhar Babu : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తరుణంలో అధికార కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదిరింది. “ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాలి” అని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై అక్బరుద్దీన్ చేసిన క్లెయిమ్ను ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం మరొకరి భిక్ష కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్…